ప్రస్తుతం దర్శకులు అందరూ పౌరాణికాలు, చారిత్రాత్మక కథల మీద ఫోకస్ పెట్టారు.పాన్ ఇండియా రేంజ్ లో తెరకేక్కించాలంటే యూనివర్శల్ కాన్సెప్ట్ అయ్యి ఉండాలి.
ఈ నేపధ్యంలో చారిత్రాత్మక కథలకి, అలాగే భారతీయ ఇతిహాసాలలో ఉన్న పౌరాణిక కథలకి యూనివర్శల్ అప్పీల్ ఉంటుందని వాటి మీద ఫోకస్ పెట్టారు.ఈ నేపధ్యంలో తెలుగులో గుణశేఖర్ శాకుంతలం అనే పౌరాణిక కథని తెరపై ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నారు.
మరో వైపు ప్రభాస్ హీరోగా ఓం రౌత్ ఆది పురుష్ టైటిల్ తో ప్రభాస్ రాముడుగా నటించబోతున్నాడు.ఇదిలా ఉంటే మధు మంతెన, అల్లు అరవింద్ నిర్మాణంలో రామాయణం కథని పూర్తిగా మూడు భాగాలుగా తెరకెక్కించడానికి రంగం సిద్ధం అవుతుంది.
అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి బాలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది.భారీ మల్టీ స్టారర్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎవరు నటించబోతున్నారు అనే విషయంపై ఇప్పుడు ఆసక్తికరమైన టాక్ వినిపిస్తుంది.ఈ త్రీడీ రామాయణంలో రాముడు పాత్ర కోసం సూపర్ స్టార్ మహేష్ బాబుని ఫైనల్ చేయబోతున్నారని తెలుస్తుంది.
అలాగే రావణుడుగా హృతిక్ రోషన్, సీత పాత్ర కోసం దీపికా పదుకునేని కన్ఫర్మ్ చేసే యోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నారని సమాచారం.ముందుగా రాముడు పాత్ర కోసం ప్రభాస్ ని తీసుకోవాలని అనుకున్న ప్రస్తుతం అతను ఆది పురుష్ సినిమాలో రాముడు పాత్ర చేస్తున్నాడు.
ఈ నేపధ్యంలోనే ఈ త్రీడీ రామాయణంలో మహేష్ బాబుని రాముడు పాత్ర కోసం తీసుకోబోతున్నారని టాక్ నడుస్తుంది.