భార్య ఉండగా ప్రియురాళ్లతో ఎంజాయ్ చేసే వాళ్లు చాలా మంది ఉంటారు.పెళ్లి చేసుకుని మరో మహిళను ప్రేమించి వేరే కాపురాన్ని పెట్టుకుంటున్నారు.
చట్టపరమైన నేరమని తెలిసినా శిక్షలు కఠినంగా లేకపోవడంతో విచ్ఛలవిడిగా రెచ్చిపోతున్నారు కొందరు వ్యక్తులు.భార్యకు తెలియకుండా సిక్రేట్ గా నడిపించుకుంటున్నారు.
అలాంటి ఘటనే తాజాగా మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాంతంలో చోటు చేసుకుంది.భార్యబిడ్డలు ఉన్నా వేరే కాపురం పెట్టాడు ఓ వ్యక్తి.
గమ్మత్తేంటంటే ఆ చిన్నిళ్లు కూడా సొంతూరు కావడం.
మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాంతానికి చెందిన కిషన్ భార్యపిల్లలు ఉన్నా రెండో కాపురం పెట్టాడు.
గుట్టుగా సాగిస్తున్నా ఆ తర్వాత విషయం మొదటి భార్యకు తెలిసింది.దీంతో ఆమె తమ కుటుంబసభ్యులకు, బంధువులకు తెలిపి ఇంటికి రప్పించుకుంది.
భర్త కిషన్ తన ప్రియురాలి ఇంటికి వెళ్లడం చూసి బంధువులతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.అక్కడ మొదటి భార్య తన భర్తను, అతడి ప్రియురాలిని కుటుంబ సభ్యులతో కలిసి చితకబాదారు.
అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
కాగా కిషన్ కు 2017లో మొదటి భార్యతో వివాహం జరిగింది.రత్నగిరిలో నిర్వహిస్తున్నాడని, ప్రియురాలి మోజులో పడి ఓ కుటుంబం ఉందని కూడా మర్చిపోయాడని మొదటి భార్య ఆరోపించింది.