కమెడియన్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు సునీల్.కమెడియన్ నుంచి హీరోగా టర్న్ తీసుకున్న సునీల్ ఆరంభంలో హ్యాట్రిక్ సొంతం చేసుకున్న తరువాత సినిమాలు అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు.దీంతో హీరోగా కెరియర్ పూర్తిగా గాడితప్పింది.దీంతో మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా బిజీ అయ్యాడు.మరో వైపు కలర్ ఫోటో అనే సినిమాతో విలన్ గా మెప్పించే ప్రయత్నం చేయడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ చేసుకొని ఓటీటీలో రిలీజ్ కి సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు సునీల్ హీరోగా వేదాంతం రాఘవయ్య టైటిల్ తో సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాకి హరీష్ శంకర్ కథ అందిస్తుడటం విశేషం.
అయితే ఈ సినిమా కథ సునీల్ కి తగ్గట్లు కామెడీ ఎంటర్టైనర్ రా లేక బయోపిక్ కథ అనేది తెలియాల్సి ఉంది.14రీల్స్ ప్లస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి తరంలో దర్శకుడుగా, కూచిపూడి నృత్య దర్శకుడుగా వేదాంతం రాఘవయ్యకి విశేషమైన గుర్తింపు ఉంది.అయితే అతని జీవిత కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారా, లేదంటే హరీష్ శంకర్ తన స్టైల్ లో పూర్తిస్థాయిలో కొత్త కథని అందిస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఈ సినిమాకి దర్శకుడు ఎవరనే విషయం కూడా చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు.టైటిల్ ఫస్ట్ లుక్ మాత్రం చాలా సింపుల్ గా ఉంది.మరి ఈ సినిమా ద్వారా సునీల్ హీరోగా తిరిగి ఎంత వరకు హిట్ కొడతాడు అనేది వేచి చూడాలి.
.