పెళ్లి.రెండు మనసులతో పాటు రెండు కుటుంబాలు కూడా ఒక్కటయ్యే అపురూప క్షణం.జీవితంలో ఒకే సారి చేసుకునే.ఆనంద హరివిల్లుల వేదిక వివాహం.గతంలో పెళ్లిచూపుల్లో చూశామా.పెళ్లిచేసుకున్నామా అన్నట్లుగా ఉండేది.
కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది.ఒకరినొకరు ఇష్టపడితేనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.
అయితే పెళ్లి పీటల మీద వరకు వచ్చి ఏవేవో కారణాల వల్ల ఆగిపోయిన ఘటనలు ఎన్నో చూస్తుంటాం.
అయితే తాజాగా ఓ పెళ్లి ఊహించని విధంగా ఆగిపోయింది.
ఇక పెళ్లి ఆగిపోతే ఆగిపోయింది.వంటలు వేస్ట్ చేయడం ఎందుకని పెళ్లికి వచ్చిన బంధువులు ఫుల్గా భోజనం చేసి ఇంటికి వెళ్లారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.కృష్ణా జిల్లాలో గుడ్లవల్లేరుకు చెందిన ఓ యువకుడికి దూర ప్రాంతానికి చెందిన ఓ యువతితో వివాహం ఖాయం అయింది.
గురువారం ఉదయం ఓ చర్చిలో వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు వైభవంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.బంధుమిత్రుల నడుమ వీరి పెళ్లి తంతు ప్రారంభం కాగా.
మతపెద్ద నీకు ఈ పెళ్లి సమ్మతమేనా అని వరుణ్ని ప్రశ్నించారు.అందుకు వరుడు ఇష్టమే అంటూ తెలిపారు.
ఇక ఇదే ప్రశ్న వధువును అడగ్గా.నాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటూ సమాధానం ఇచ్చి అందరినీ షాక్కు గురిచేసింది.
అయితే చివరకు కుటుంబసభ్యులు వధువుకు నచ్చచెప్పి పెళ్లికి ఒప్పించగా.ఈసారి యువకుడు నో చెప్పాడు.దీంతో మతపెద్ద ఇక ఈ పెళ్లి జరగదని చెప్పి.ఇళ్లకు వెళ్లిపోమన్నారు.
కానీ, అప్పటికే వంటలు అన్నీ పూర్తి అవ్వడంతో.వాటిని పారేడం ఎందుకని భావించిన బంధుమిత్రులు కడుపునిండా భోజనం చేసి ఇంటికి వెళ్లారు.