మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత మరియు ఆమె భర్త కలిసి ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించారు.ఇటీవలే ఆ నిర్మాణ సంస్థను చిరంజీవి భార్య సురేఖ గారు పూజా కార్యక్రమాలు నిర్వహించి మొదలు పెట్టారు.
ఆ నిర్మాణ సంస్థలో ఒక వెబ్ సిరీస్ను సుష్మిత దంపతులు నిర్మిస్తున్నారు.ప్రకాష్ రాజ్ మరియు సంపత్ రాజ్ లు కీలక పాత్రల్లో ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ జెట్ స్పీడ్తో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో కరోనా కారణంగా బ్రేక్ పడినది.
సహాయ దర్శకుడు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో ఆయనతో కాంటాక్ట్ అయిన వారు అంతా కూడా పరీక్షకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.అలాగే కనీసం వారం రోజులు షూటింగ్ ను నిలిపేయాల్సి వచ్చింది.యూనిట్ సభ్యుల్లో మరికొందరు కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయితే మరికొన్నాళ్ల పాటు షూటింగ్ను ఆపేయలని సుష్మిత భావిస్తున్నారు.మొదటి ప్రాజెక్ట్ కు ఇలాంటి అడ్డంకి రావడంపై సుష్మిత ఆవేదన వ్యక్తం చెందుతున్నారట.
ఇప్పటి వరకు జరిగిన షూటింగ్లో పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయ్యింది.సగానికి పైగా పూర్తి అయిన ఈ షూటింగ్ను వచ్చే నెలలో పూర్తి చేయాలనుకున్నారు.సెప్టెంబర్ లేదా అక్టోబర్లో జీ 5లో ఈ వెబ్ సిరీస్ ను ప్రదర్శించేందుకు కూడా రెడీ అయ్యారు.ఇలాంటి సమయంలో కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోవడం అనేది సుష్మితకు పెద్ద షాక్గా ఉంది.
ఆ తర్వాత అయినా సవ్యంగా షూటింగ్ సాగుతుందో లేదో చూడాలి.