సూపర్‌స్టార్‌కు షాక్‌ ఇచ్చిన జియో

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ దాదాపు రెండు దశాబ్దాల పాటు నెం.1 గా వెలుగు వెలిగాడు.కాని గత కొన్ని సంవత్సరాలుగా మాత్రం ఈయన క్రేజ్‌ తగ్గింది.చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడటంతో పాటు ఏమాత్రం ఆకట్టుకోని కథ కథనంతో సినిమాలు చేయడం వల్ల ఈయన్ను జనాలు మర్చి పోతున్నారు.

 Super Star Sharukh Khan, Akshay Kumar, Jio Brand Ambassador, Reliance,mukesh Amb-TeluguStop.com

గత రెండు సంవత్సరాలుగా షారుఖ్‌ సినిమాలే చేయడం లేదు.గతంలో షారుఖ బ్రాండ్‌ విలువ ఓ రేంజ్‌లో ఉండేది.కాని ఇప్పుడు చాలా తగ్గింది.

ప్రముఖ టెలీకమ్యునికేషన్‌ సంస్థ జియోకు చాలా కాలంగా షారుఖ్‌ ఖాన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.

ఇప్పుడు షారుఖ్‌ ను జియో తొలగించింది.ప్రస్తుతం బాలీవుడ్‌లో నెం.1 గా ఉన్న అక్షయ్‌ కుమార్‌ను తమ జియోకు అంబాసిడర్‌గా నియమించినట్లుగా ప్రకటన చేసింది.షారుఖ్‌కు ఇచ్చిన పారితోషికంకు దాదాపు 150 రెట్లు అక్షయ్‌ కుమార్‌కు జియో సంస్థ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

2020 మరియు 2021 సంవత్సరానికి గాను అక్షయ్‌ కుమార్‌తో జియో సంస్థ ఒప్పందం చేసుకుంది.దేశ వ్యాప్తంగా అక్షయ్‌ కుమార్‌కు ఉన్న క్రేజ్‌తో తమ జియో బ్రాండ్‌ వాల్యూ మరింతగా పెరుగుతుందని రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ అభిప్రాయ పడ్డారట.

అందుకే అక్షయ్‌ కుమార్‌తో ఒప్పందం విషయంలో సుదీర్ఘ చర్చలు జరిగాయి.షారుఖ్‌ ను పూర్తిగా తొలగించారా లేదంటే ఆయనతో కూడా యాడ్స్‌ చేస్తారా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube