స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో ఇప్పటికే ఎలాంటి క్రేజ్ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో బన్నీ బాక్సాఫీస్ను చెడుగుడు ఆడటం ఖాయమని అంటున్నారు సినీ జనం.
కాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా సెన్సార్ పనులను శనివారం బదులుగా శుక్రవారం పూర్తి చేసేసుకుంది.ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ను జారీ చేశారు.
ఈ సినిమాపై సెన్సార్ బోర్డు సభ్యులు పొగడ్తల వర్షం కురిపించారు.త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎమోషనల్ మూవీగా ఈ సినిమా ఉందని, బన్నీ యాక్టింగ్, త్రివిక్రమ్ టేకింగ్కు ఆడియెన్స్ ఫిదా కావడం ఖాయమని వారు అన్నారు.
ఫ్యామిలీ ఆడియెన్స్తో పాటు యూత్ను అలరించే అంశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయని వారు కితాబిచ్చారు.త్రివిక్రమ్ నుండి ఎలాంటి సినిమాను ఆశిస్తారో అదే తెరపై మనకు కనిపిస్తుందని వారు తెలిపారు.
సెన్సార్ సభ్యులు అల వైకుంఠపురములో సినిమాను చూసి పూర్తి సంతృప్తిని వ్యక్తపరిచినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మాత్రం అప్పటివరకు ఆగాల్సిందే.