టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గత కొన్నాళ్లుగా ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాడు.ఈయన గత దశాబ్ద కాలంగా చేసిన ఏ ఒక్క సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు.
దాంతో కృష్ణ వంశీ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు గతంలో క్యూ కట్టే హీరోలు ఇప్పుడు ఆయనకు మొహం చూపేందుకు కూడా భయపడుతున్నారు.కృష్ణవంశీ దర్శకత్వంలో గతంలో చేసిన హీరోలు సైతం ఇప్పుడు బాబోయ్ అంటున్నారు.
తాజాగా కృష్ణవంశీ రుద్రాక్ష అనే చిత్రాన్ని చేయబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.అయితే ఆ వార్తలపై తాజాగా క్లారిటీ వచ్చేసింది.
బండ్ల గణేష్ నిర్మాణంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించబోతున్న ‘రుద్రక్ష’ మూవీతో కృష్ణవంశీ మళ్లీ మునుపటి క్రేజ్ను దక్కించుకుంటాడని అంతా ఆశించారు.కాని తాజాగా ఆ సినిమా వార్తలు కేవలం పుకార్లే అని, ప్రస్తుతం తాను రుద్రాక్ష స్క్రిప్ట్పై పని చేయడం లేదని, ప్రస్తుతానికి ఆ సినిమా ఆలోచన కూడా లేదన్నాడు.
బండ్ల గణేష్ నిర్మాణంలో అనే విషయం కూడా నిజం కాదని క్రియేటివ్ డైరెక్టర్ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.
బండ్ల గణేష్ నిర్మాతగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వచ్చిన వార్తలు నిజం కాదని తేలిపోయింది.ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్న బండ్ల గణేష్ సినిమా నిర్మాణం ఇప్పట్లో చేయలేడని ఆయన సన్నిహితులు అంటున్నారు.ప్రస్తుతానికి బిజినెస్ వ్యవహరాలు చూసుకుంటున్న బండ్ల గణేష్ కుదిరితే నటుడిగా రీ ఎంట్రీ ఇవ్వాలని ఆశ పడుతున్నాడు.
సరిలేరు నీకెవ్వరు సినిమాలో బండ్ల గణేష్ ఒక కమెడియన్ పాత్రను పోషించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.అందులో నిజం ఎంతో చూడాలి.