మనలో చాలా మందికి నెయ్యి అంటే చాలా ఇష్టం.అలాగే కొంత మందికి నెయ్యి వేసుకొందే ముద్ద దిగదు.
మరి కొంత మంది నెయ్యితో స్వీట్స్ తయారుచేసుకుంటారు.ఇలా కాకుండా ప్రతి రోజు పరగడుపున ఒక స్పూన్ నెయ్యి తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
ఉదయం నెయ్యి తిన్న వెంటనే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని త్రాగటం మాత్రం మర్చిపోకూడదు.ఇప్పుడు పరగడుపున నెయ్యి తినటం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ప్రతి రోజు ఉదయం పరగడుపున ఒక స్పూన్ నెయ్యి తింటే జీర్ణ సమస్యలు దూరం అవటమే కాకుండా తీసుకున్న ఆహారం కూడా బాగా జీర్ణం అవుతుంది.దాంతో గ్యాస్,ఎసిడిటి సమస్యలు కూడా బాధించవు.
నెయ్యిలో విటమిన్ A సమృద్ధిగా ఉండుట వలన కంటి సంబంధింత సమస్యలు రాకుండా ఉంటాయి.
చాలా మంది నెయ్యి తింటే కొలస్ట్రాల్ పెరుగుతుందని అనుకుంటారు.
కానీ నెయ్యి మంచి కొలస్ట్రాల్ ని పెంచుతుంది.నెయ్యిని పరిమితంగా తింటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా ప్రతి రోజు నెయ్యి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.నెయ్యిలో ఉన్న పోషకాల కారణముగా తల్లి ఆరోగ్యం మరియు కడుపులో పెరుగుతున్న పిండం ఆరోగ్యంగా ఎదుగుతుంది.
నెయ్యిని రెగ్యులర్ గా తీసుకుంటే చర్మం కాంతివంతంగా మారటమే కాకుండా మొటిమలు,మచ్చలు,ముడతలు రావు.
నెయ్యిలో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి శరీరంపై అయిన గాయాలు, పుండ్లు త్వరగా మానటమే కాకుండా అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలిగిస్తుంది.
నెయ్యిలో ఉండే విటమిన్ డి ఎముకలకు మేలు చేస్తుంది.ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి.