ఐటీ రంగంలో హైదరాబాద్ మహానగరం ప్రపంచానికి టాప్ ప్లేస్ లో ఒకటిగా వుంది.వేల సంఖ్యలో ఐటీ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్స్తున్నాయి.
అలాగే ప్రపంచ స్థాయి ఐటీ సంస్థలు కూడా తమ బ్రాంచ్ లని హైదరాబాద్ లో నడుపుతున్నాయి.త్వరలో మరో ఐటీ అగ్రగామి సంస్థ హైదరాబాద్ లో అడుగు పెట్టబోతుంది.
అంతర్జాల ప్రపంచాన్ని శాసిస్తున్న గూగుల్ కంపెనీ తన బ్రాంచ్ ని హైదరాబాద్ లో పెట్టడానికి సిద్ధం అవుతుంది.దీనికి సంబంధించిన అన్ని అనుమతులు ఇప్పటికే ఆ కంపెనీకి లభించినట్లు తెలుస్తుంది.
గూగుల్ అమెరికా కేంద్రంగా పని చేస్తుంది.ఇక తమ సంస్థ నుంచి ప్రపంచంలో రెండో అతి పెద్ద బ్రాంచ్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.22 అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం గూగుల్ కంపెనీ కోసం నిర్మిస్తున్నట్లు నిర్ధారించింది.ఈ కంపెనీకి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ కూడా లభించాయని ఆ సంస్థ ప్రతినిధులు నిర్ధారించారు.
ఇక హైదరాబాద్ కేంద్రంగా పని చేసే తమ రెండో అతి పెద్ద బ్రాంచ్ లో మొత్తం 13 మంది ఉద్యోగులు పని చేస్తారని కూడా గూగుల్ సంస్థ ప్రకటించింది.గూగుల్ సంస్థ రాకతో మరో అంతర్జాతీయ సాఫ్ట్ వేర్ కంపెనీకి హైదరాబాద్ వేదిక కాబోతుంది అని తెలుస్తుంది.