రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో గ్రామపంచాయతీ సిబ్బంది నిరవధిక సమ్మె నేటికీ 29వ చేరుకోవడం జరిగింది.ఈ సందర్భంగా జిపి కార్మికులు మాట్లాడుతూ కార్మికుల డిమాండ్ లను త్వరగా నెరవేర్చి వారి పనుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.
పోటీ కార్మికులను పెట్టి చేయిస్తే గొడవలు జరిగే అవకాశం ఉందని
మండలం అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు లింగంపల్లి, కృష్ణవేణి ఉపాధ్యక్షులు కంసాన్ రవీందర్, ఆత్మకూర తిరుపతి , కనకవ్వ, గుడిసెల నరసమ్మ, సంఘపట్ల ప్రేమ లత కార్మికులు పాల్గొన్నారు.