మన టైం బాగా లేకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు అని ఒక నానుడి ఉంది.తాజాగా ఇక్కడ జరిగిన వింత విషాద ఘటనకి ఈ నానుడి సరిగ్గా సరిపోతుంది.
ఓ వివాహిత చనిపోవాలని ఆత్మహత్యాయత్నం చేసింది.బతికి బయటపడింది కానీ అంతలోనే యాక్సిడెంట్ లో ప్రాణాలు వదిలింది.
ఈ విషాద ఘటన కేరళలో జరిగింది.
వివరాల్లోకి వెళితే… కేరళలోని అలప్పుజ జిల్లా తన్నీరుమొక్కంకి చెందిన రాఖీ అనే వివాహిత ఈ లోకాన్ని విడిచి పోవాలని అనుకుంది.
ఈ క్రమంలోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య యత్నం చేసింది, ఇక మంటల్లో సజీవదహనం అవుతున్నా రాఖీని చూసి కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై మంటలు ఆర్పారు.అప్పటికే ఆమె శరీరం చాలా మటుకు కాలింది.
హుటాహుటిన అంబులెన్స్ లో అలప్పుజ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు, అయితే ఆత్మహత్య రూపంలో రాని మృత్యువు యాక్సిడెంట్ రూపంలో ఆ మహిళను కబలించింది.66వ జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఆంబులెన్స్ ఎదురుగా వస్తున్న ఇసుక లారీని ఢీకొట్టింది.అర్థరాత్రి జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో రాఖీ అక్కడికక్కడే మృతి చెందింది.కుటుంబ సభ్యులకు స్వల్పగాయాలయ్యాయి.కాగా సదరు మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.