నెలసరి సమయంలో కడుపు నొప్పి, నడుము నొప్పి, కాళ్ల నొప్పి ఇలా ఎన్నెన్నో నొప్పులతో స్త్రీలు తీవ్ర వేదనకు గురవుతుంటారు.ఈ నొప్పులను తట్టుకోలేక, వాటిని ఎలా నివారించుకోవాలో తెలియక పెయిణ్ కిల్లర్స్ ను తెగ వాడుతుంటారు.
అయితే నెలసరి నొప్పులను దూరం చేయడంలో చింతపండు ఆకులు అద్భుతంగా సహాయపడతాయి.మరి చింత పండు ఆకులను ఎలా తీసుకోవాలి.? అసలు చింత పండు ఆకులు తీసుకోవడం వల్ల ఏ ఏ ప్రయోజనాలు కలుగుతాయి.? అన్న విషయాలు లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందు చింత పండు ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెట్టుకోవాలి.బాగా డ్రై అయిన తర్వాత మెత్తగా పొడి చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి.
ఇక ఈ చింత పండు ఆకుల పొడిని ఎలా తీసుకోవాలో కూడా చూసేయండి.ఒక బౌల్ లో గ్లాస్ వాటర్ పోసి.అందులో ఒక స్పూన్ చింత పండు ఆకుల పొడి వేసి బాగా మరిగించి.నీటిలో ఫిల్టర్ చేయండి.
అపై ఈ వాటర్లో కొద్దిగా తేనె కలిపి సేవించాలి.
నెలసరి సమయంలో ఇలా చేస్తే.
కడుపు నొప్పి, నడుము నొప్పి, కాళ్ల నొప్పి, తల నొప్పి ఇలా అన్ని నొప్పులు పరార్ అవుతాయి.
కడుపులో నులి పురుగుల ఉన్నా చచ్చిపోతాయి.అలాగే ఈ వాటర్ను తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో అధిక వేడి తగ్గు ముఖం పడుతుంది.నోటిలో వచ్చే పగుళ్లు, పూత వంటివి దూరం అవుతాయి.
కంటి చూపు కూడా పెరుగుతుంది.
అంతేకాదు, చింత పండు ఆకులను మరిగించిన నీటిని తీసుకుంటే శరీరంలో మలినాలన్నీ బయటకు పోతాయి.
రక్తం శుద్ధి అవుతుంది.ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగి రక్త హీనత తగ్గు ముఖం పడుతుంది.
గుండె ఆరోగ్యంగా మారుతుంది.మరియు రోగ నిరోధక వ్యవస్థ సైతం బలంగా మారుతుంది.