భారత ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పద్మ అవార్డుల గురించి మనకు తెలిసిందే.భారత ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏకంగా 128 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది.
ఈ క్రమంలోనే పశ్చిమబెంగాల్ కు చెందిన సీనియర్ సింగర్ సంధ్య ముఖర్జీ కేంద్ర ప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మశ్రీ అవార్డును తిరస్కరించింది.అయితే భారత ప్రభుత్వం ఎంతో గౌరవ సూచకంగా ఇచ్చే ఈ పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.
భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డు తనకు వద్దని తన స్థాయికి ఈ అవార్డు తగదని ఈ అవార్డులను జూనియర్లకు ఇస్తే మంచిదని సంధ్య ముఖర్జీ తన అభిప్రాయాన్ని తెలిపారు.ఇక పశ్చిమబెంగాల్ కు చెందిన వారిలో ఇలా పద్మ అవార్డులను తిరస్కరించిన వారిలో ఈమె రెండవ వ్యక్తిగా నిలిచిపోయారు.
ఈ విధంగా సింగర్ సంధ్య ముఖర్జీ పద్మశ్రీ అవార్డును తిరస్కరించడంతో ఆమె కూతురు సౌమీ సేన్గుప్తా మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఢిల్లీ నుంచి అమ్మగారికి పద్మశ్రీ అవార్డుకు ఎంపిక అయినట్లు ఫోన్ వచ్చిందని తెలిపారు.ఈ వయసులో అమ్మకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం ఎంతో అవమానకరమని ఈ సందర్భంగా సౌమీ సేన్గుప్తా మీడియాకు తెలిపారు.ఇకపోతే పశ్చిమబెంగాల్ కు చెందిన మాజీ ముఖ్యమంత్రి బుద్దదేబ్ బట్టాచార్య కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ అవార్డును తిరస్కరించగా తాజాగా సంధ్య ముఖర్జీ పద్మశ్రీ అవార్డును తిరస్కరించి రెండవ వ్యక్తిగా నిలిచారు.అయితే మన దేశంలో ఇప్పటికే చాలామంది వారికి వచ్చిన పద్మ అవార్డులను తిరస్కరించిన సంగతి మనకు తెలిసిందే.2013వ సంవత్సరంలో సింగర్ జానకి పద్మభూషణ్ అవార్డును తిరస్కరించిన విషయం మనకు తెలిసిందే.