టాలీవుడ్ లో 1997వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన టువంటి “పెళ్లి” అనే చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.ఈ చిత్రంలో హీరోగా నటించినటువంటి వడ్డే నవీన్ తన పాత్రకి వంద శాతం న్యాయం చేశాడు.
దీంతో ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.అయితే వడ్డే నవీన్ నటన పరంగా సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాడు.
అయితే ఏమైందో ఏమో గాని ఉన్నట్లుండి సినిమాల్లో నటించడమే మానేశాడు.
తెలుగులో వడ్డే నవీన్ దాదాపుగా 30 చిత్రాల్లోకి పైగా నటించా డు.ఇందులో దాదాపుగా 20 చిత్రాలు పర్వాలేదనిపించాయి.ఒకప్పుడు సినీ కెరియర్ లో మంచి ఫామ్ లో ఉన్నటువంటి వడ్డే నవీన్ తన వ్యక్తిగత కారణాల వల్ల సినీ పరిశ్రమకు దూరమైనట్లు తెలుస్తోంది.
అంతేకాక కథల విషయంలో కూడా కొంత మేర అవగాహన లేకపోవడంతో ఈ కారణం కూడా వడ్డే నవీన్ సినీ కెరియర్ పతనానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు.అయితే వడ్డే నవీన్ చివరిగా ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2016వ సంవత్సరంలో దర్శకత్వం వహించినటువంటి “ఎటాక్” చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించాడు.
అయితే ఆ తర్వాత మళ్లీ కొత్త చిత్రాలకు ఎస్ చెప్పలేదు.
అయితే ప్రస్తుతం వడ్డే నవీన్ తన కుటుంబ పరిస్థితులను చక్కదిద్దుకొనే పనిలో పడినట్లు తెలుస్తోంది.అయితే సినిమాల పరంగా వడ్డే నవీన్ సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం తెలుగు స్టార్ హీరోలతో మంచి సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు.ఇటీవల వడ్డే నవీన్ కొడుకు జిష్ణు పంచకట్టు వేడుకకి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ హీరోయిన్ రాశి, హీరో శ్రీకాంత్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ రాజా తదితరులు హజరవ్వడమే నిదర్శనం.