మన టాలీవుడ్ లో స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు మెహర్ రమేష్.ఈయన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో చేసిన బిల్లా సినిమాతో స్టైలిష్ డైరెక్టర్ అని పేరు సంపాదించాడు.
కానీ ఆ పేరును ఎంతో కాలం నిలుపుకోలేక చతికల పడ్డాడు.బిల్లా సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో శక్తి సినిమా చేసాడు.
అయితే ఈ సినిమా విడుదల కు ముందు ఎన్ని అంచనాలు వచ్చాయో విడుదల తర్వాత రిజల్ట్ అందుకు వ్యతిరేకంగా వచ్చింది.
శక్తి సినిమా ఎవ్వరు ఊహించని విధంగా డిజాస్టర్ అవ్వడంతో మెహర్ రమేష్ అప్పటి వరకు ఉన్న పేరు కొద్దిగా పోయిందనే చెప్పాలి.
ఎన్టీఆర్ కెరీర్ కు కూడా ఈ సినిమా అప్పట్లో మైనస్ అయ్యిందనే చెప్పాలి.అయితే మెహర్ రమేష్ ఈ సినిమా తర్వాత చేసిన సినిమా కూడా మళ్ళీ అదే లెవల్ లో డిజాస్టర్ అయ్యింది.
మెహర్ రమేష్ శక్తి సినిమా తర్వాత వెంకటేష్ తో షాడో సినిమా తెరకెక్కించాడు.
అసలు అంత బడ్జెట్ తో ఈ సినిమా ఎలా చేసాడో అని అందరు విమర్శించారు.
రెండు సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అవ్వడంతో మెహర్ రమేష్ మళ్ళీ మరొక సినిమా చేయలేదు.
షాడో సినిమా వచ్చి దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది.కానీ మెహర్ రమేష్ మరొక సినిమా ప్రకటించడానికి 8 సంవత్సరాలు పట్టింది.తాజాగా మెగాస్టార్ చిరంజీవి తో ఒక సినిమా ప్రకటించాడు.
ఈ సినిమాకు ‘భోళా శంకర్‘ అనే టైటిల్ కన్ఫర్మ్ చేయడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి.అయితే ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొడతాడని మెగా అభిమానులు భావిస్తున్నారు.మెగాస్టార్ పుట్టిన రోజు నాడు ప్రకటించిన మిగతా సినిమాలు కన్నా కూడా ఈ సినిమాపైనే ప్రేక్షకులు ఆతృతగా ఉన్నారు.
టైటిల్ మాత్రమే కాదు రాఖీ పండుగ సందర్భంగా చిరంజీవి, కీర్తి సురేష్ ల రాఖి స్పెషల్ గ్లిమ్స్ రిలీజ్ చెయ్యడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
ఈసారి ఎలాగైనా హిట్ కొడతాడని అందరు భావిస్తున్నారు.మరి చూడాలి మెహర్ రమేష్ కు ఇప్పటికైనా మంచి రోజులు వచ్చాయో లేదో.