భారత్లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతుంది.కరోనా కేసుల సంఖ్య లక్షకి సమీపిస్తుంది.
ఇక ఆర్ధిక రాజధాని ముంబైలో అయితే చాలా వేగంగా వ్యాపిస్తుంది.మురికివాడలు ఎక్కువగా ఉండటంతో కరోనాని కట్టడి చేయడంలో అక్కడి ప్రభుత్వం విఫలం అవుతుంది.
మరో వైపు ముంబైలో బాలీవుడ్ సెలబ్రిటీలని సైతం కరోనా భయం వెంటాడుతుంది.ఇప్పటికే సింగర్ కనికా, ఒక నిర్మాత ఫ్యామిలీ కరోనా కోరల్లోకి వెళ్లి వచ్చారు.
ఇప్పుడు మరో బాలీవుడ్ నటుడు తండ్రి కరోనా బారిన పడ్డాడు.ఈ ఆ నటుడే విషయాన్ని ఆయనే స్వయం తెలియజేశాడు.
పలు బాలీవుడ్ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా చేసి తెలుగులో రవితేజ టచ్ చేసి చూడు సినిమాలో విలన్ గా నటించిన ఫ్రెడ్డీ దారూవాలా తండ్రికి కరోనా సోకింది.
తనతో పాటు తన కుటుంబ సభ్యులందరం క్వారంటైన్లో ఉన్నామని, ఇతరులకి సోకకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన చెప్పాడు.
ఇక ఫ్రెడ్డీ తండ్రికి కరోనా సోకిందని తెలుసుకున్న ముంబై బీఎంసీ అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు.ఆయన ఇంటికి సీలు వేసి, శుభ్రపరిచారు.అంతేకాకుండా ఇంట్లో ఉన్నవాళ్లందరికీ కూడా టెస్టులు నిర్వహించారు.తన తండ్రికి గత కొన్ని రోజులుగా జ్వరం, జలుబు తదితర ఫ్లూ లక్షణాలు ఉండడంతో అతనికి ప్రత్యేక గదిని కేటాయించామని… మరుగుదొడ్డి కూడా సపరేట్గానే ఉందని… బట్టలు, వస్తువులు, అన్నీ కూడా శానిటైజ్ చేశామని ఫ్రెడ్డీ తెలిపారు.
ప్రస్తుతం ఆయన పరిస్థితిని చూస్తుంటే చాలా బాధగా ఉందని, ధ్యానం, ప్రార్థనలు ఆయనకి సహాయపడతాయని ఫ్రెడ్డీ పేర్కొన్నారు.