మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలంగాణ పార్టీకి ఇటీవల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు రావటం.
వెంటనే టిఆర్ఎస్ పార్టీ హైకమాండ్ బర్తరఫ్ చేయడం తో ఇదంతా కుట్ర పూరితంగా పద్ధతిగా చేయటం జరిగిందని ఈటల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి ఇటీవల పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.అంతకుముందే ఢిల్లీలో బిజెపి నాయకులతో రాష్ట్రంలో బిజెపి నాయకులతో సమావేశమయ్యే కాషాయ పార్టీ లోకి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది.
ఈ నేపథ్యంలో ఈరోజు డిల్లీ వెళ్ళటానికి రాష్ట్ర బిజెపి నాయకులకు తనకి కరెక్ట్ ప్రత్యేక విమానం ఈటల రాజేందర్ ఏర్పాటు చేయడం జరిగింది.ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని బిజెపి కార్యాలయంలో కాషాయ కండువ ఈటల రాజేందర్ కప్పుకో నున్నారు.
ఆ తర్వాత బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డాతో ఈటల భేటీ కాబోతున్నారు. అనంతరం రేపు తిరిగి హైదరాబాద్ కి చేరుకోనున్నారు.
.