ఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోలు దర్శకుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.దర్శకులకు ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి కథ ఏ మాత్రం నచ్చకపోయినా సినిమాకు సంబంధించి ఏదైనా సమస్య ఉన్నా సెట్స్ పైకి వెళ్లక ముందే ఆ సినిమాను ఆపేస్తున్నారు.
మరో డైరెక్టర్ తో వెంటనే ప్రాజెక్ట్ ను ప్రకటించి అభిమానులను సైతం స్టార్ హీరోలు ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.
సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన చిరంజీవి( Chiranjeevi ) పూరీ కాంబినేషన్ లో ఆటో జానీ అనే సినిమా ప్రచారంలోకి రాగా సెకండాఫ్ సంతృప్తికరంగా లేదని చిరంజీవి ఈ సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకున్నారు.గాడ్ ఫాదర్ సినిమా కోసం మొదట వినాయక్ ( VV Vinayak ) పని చేయగా ఆయన చేసిన మార్పులు నచ్చకపోవడంతో వినాయక్ స్థానంలో మోహన్ రాజా చేరారు.చిరంజీవి సుజిత్ చిరంజీవి వెంకీ కుడుముల కాంబో సినిమాలు సైతం వేర్వేరు కారణాల వల్ల ఆగిపోయాయి.
జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) త్రివిక్రమ్ కాంబోలో అరవింద సమేత తర్వాత మరో సినిమాకు సంబంధించి ప్రకటన వెలువడగా సినిమా బడ్జెట్ లో వాటాలకు సంబంధించిన సమస్య వల్ల ఈ సినిమా ఆగిపోయింది.ఎన్టీఆర్ బుచ్చిబాబు కాంబోలో ఒక సినిమా వస్తుందని ప్రచారం జరగగా ఆ మూవీ సైతం ఆగిపోవడం గమనార్హం.బన్నీ కొరటాల శివ( Allu Arjun Koratala Siva ) కాంబోలో ఒక సినిమాకు సంబంధించి ప్రకటన వెలువడి ఆగిపోయింది.
వెంకటేశ్ హీరోగా తెరకెక్కనున్న 75వ సినిమాకు ఎంతోమంది దర్శకుల పేర్లు వినిపించగా చివరకు ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు.యంగ్ జనరేషన్ హీరోలలో కూడా చాలామంది దర్శకులను మారుస్తూ కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.విజయ్ దేవరకొండ పూరీ కాంబోలో లైగర్ తర్వాత మరో మూవీ తెరకెక్కాల్సి ఉండగా ఆ సినిమా ఆగిపోయింది.
చరణ్ గౌతమ్ తిన్ననూరి, నితిన్ కృష్ణచైతన్య, వరుణ్ తేజ్ సాగర్ కే చంద్ర కాంబినేషన్లలో కూడా సినిమాలు ఆగిపోయాయి.