ఏపీలోని వైసీపీ పాలనపై టీడీపీ నేత దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతోందని తెలిపారు.
టీడీపీ నేతలపై కుట్రపూరితంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.
తప్పుడు కేసులకు భయపడేది లేదని దేవినేని ఉమ తెలిపారు.
ఈ క్రమంలోనే కుట్రలకు పాల్పడుతున్న కొడాలి నాని, వల్లభనేని వంశీపై ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు.పోలీసులు కూడా వైసీపీ నేతలకే వత్తాసు పలుకుతున్నారని దేవినేని విమర్శించారు.
రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి, నేతలకు ప్రజలు గుడ్ బై చెబుతారన్న ఆయన టీడీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.