కడప జిల్లాలో స్కూల్ విద్యార్థి అనుమానాస్పద మృతి

కడప జిల్లా కాజీపేట మండలం జమ్మలపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.ఈ క్రమంలో తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాలు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు.

 Suspicious Death Of A School Student In Kadapa District-TeluguStop.com

దీంతో పాఠశాల వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది.అయితే విద్యార్థిని కొట్టి చంపారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలోనే మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు.స్కూల్ యాజమాన్యం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు విద్యార్థి మృతిపై పాఠశాల యాజమాన్యం నోరు విప్పలేదని తెలుస్తోంది.దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మృతుని బంధువులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహంతో పాఠశాలపై దాడికి యత్నించారు.

పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube