సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ గొగోయ్ మరి కొన్ని రోజుల్లో రిటైర్ కాబోతున్న నేపథ్యంలో కీలక కేసులన్నింటిలో తుది తీర్పులు ఇచ్చేయాలని భావించారు.అందుకోసమే ఇప్పటికే అయోద్య కేసుకు సంబంధించిన తీర్పు వచ్చేసింది.
హిందువులకు అనుకూలంగా ఆ తీర్పు ఉంది.త్వరలో రామ మందిరం నిర్మాణం జరుగబోతుంది.
అందుకే కేరళ శబరిమల ఆలయం గురించి కూడా ప్రస్తుతం జరుగుతున్న వివాదంను సుప్రీం కోర్టు ఒక పరిష్కారం ఇస్తుందని అంతా ఆశించారు.
ప్రస్తుతం శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం వద్దని దేవాలయం వారు కోరుతుండగా కొందరు మాత్రం మహిళ భక్తులకు అనుమతించాలంటూ డిమాండ్ చేస్తూ కోర్టుకు వెళ్లగా కోర్టు అనుమతించింది.
అయితే దేవాలయం కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రివ్యూ పిటీషన్ వేసింది.రివ్యూ పిటీషన్ ద్వారా మహిళలకు అవకాశం లేదు అంటూ తీర్పు వస్తుందని అంతా భావించారు.
కాని దేవాలయంలోకి లేడీస్ వెళ్లే విషయమై తుది తీర్పు రాలేదు.రేపు ఎల్లుండి ఏమైనా వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.