కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.ముస్తాబాద్ లోని ఓ అంగన్ వాడీ సెంటర్లో ఆయా పైశాచికం ప్రదర్శించింది.
తన మాటలు వినడం లేదంటూ ఐదేళ్ల బాలుడిని వాతలు వచ్చేలా కొట్టింది.విషయం తెలుసుకున్న బాలుడి బంధువులు ఆయా పై తహశీల్దార్కు ఫిర్యాదు చేశారు.
దీంతో అంగన్ వాడీ సెంటర్ ను పరిశీలించిన తహశీల్దార్.బాలుడిని ఆస్పత్రికి తరలించారు.
బాలుడిపై కిరాతకంగా దాడి చేసిన నిందితురాలిపై కఠినచర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.