మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ క్రాక్ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి అదిరిపోయే సక్సెస్ను సొంతం చేసుకునేందుకు రవితేజ రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు గోపీచంద్ మలినేని తీర్చిదిద్దుతున్నాడు.గతంలో రవితేజతో కలిసి డాన్ శీను, బలుపు వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన గోపీచంద్, ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు.
కాగా ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ నటిస్తుండగా, ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూతపడటంతో ఈ సినిమాను రిలీజ్ చేయలేకపోయారు.
ఇక ఈ సినిమాను రిలీజ్ చేయాలంటూ ఓటీటీల దగ్గర్నుండీ భారీ మొత్తంలో ఆఫర్లు వచ్చి పడుతుండటంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోన్నట్లు తెలుస్తోంది.బాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ అవుతుండటంతో రవితేజ లాంటి క్రేజ్ ఉన్న హీరోల సినిమాలను భారీ రేటు వెచ్చించి మరీ రిలీజ్ చేసేందుకు ఓటీటీలు ప్రయత్నిస్తున్నాయి.
ఠాగూర్ మధు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోండగా సముథ్రికరన్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాయి.
కాగా ఈ సినిమాతో రవితేజ ఎలాంటి హిట్ అందుకుంటాడో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.ఇక ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ అవుతుందో లేదో చూడాలి అంటున్నారు మాస్ రాజా ఫ్యాన్స్.