మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది.
ఈ సినిమా తర్వాత మలయాళంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన పొలిటికల్ డ్రామా మూవీ లూసీఫర్ రీమేక్ తెరకెక్కబోతుంది.రామ్ చరణ్ ఇప్పటికే సినిమా రీమేక్ రైట్స్ కొనేసి దీనిని ఏ దర్శకుడు చేతిలో పెడితే బాగుంటుంది అనే విషయం మీద ఆలోచిస్తున్నారు.
ఇప్పటి వరకు ఈ సినిమా రీమేక్ కోసం సురేందర్, సుకుమార్, వివి వినాయక్ పేర్లు గట్టిగా వినిపించాయి.అయితే ఇప్పుడు అనూహ్యంగా ఓ యంగ్ దర్శకుడు పేరు తెరపైకి వచ్చింది.
తండ్రితో కలిసి నటించడానికి రామ్ చరణ్ ఈ సినిమా చేయాలని భావిస్తున్నాడు.ఈ జెనరేషన్ దర్శకులు కథలని ప్రెజెంట్ చేసే విధంగా కొత్తగా ఉంటుంది.దర్శకుడు సుజిత్ సాహో సినిమా ద్వారా రచయితగ ఫెయిల్ అయిన దర్శకుడుగా ప్రూవ్ చేసుకున్నాడు.అందులో యాక్షన్ ఎలిమెంట్స్ ని యూనివర్శల్ సినిమాల స్థాయిలో ఆవిష్కరించాడు.
ఈ నేపధ్యంలో రీమేక్ అవకాశం సుజిత్ కు ఇవ్వాలని అనుకుంటున్నట్లు టాక్ నడుస్తుంది.లూసిఫర్ మేకింగ్ చాలా స్టైలిష్ గా ఉంటుంది.
సుజిత్ కూడా స్టైలిష్ గానే సినిమాలు తీస్తుంటాడు కాబట్టి అతను పెర్ఫెక్ట్ ఛాయస్ అనే మాట కూడా వినిపిస్తుంది.