ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరిపై మంత్రి రోజా తీవ్రంగా మండిపడ్డారు.పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలా? లేక టీడీపీ అధ్యక్షురాలా? అని ప్రశ్నించారు.చంద్రబాబు అబద్దాలనే పురంధేశ్వరి చెబుతోందని విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందా లేక ఇది వరకే అప్పుల్లో మునిగిపోయిందా అన్న విషయం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పాలన్నారు.
చంద్రబాబు హయాంలోనే ఎక్కువ అప్పులు చేశారని చెప్పారు.మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ అప్పులు చాలా తక్కువని పేర్కొన్నారు.ప్రతి పైసా సంక్షేమ పథకాల కోసమే ఖర్చు చేస్తున్నామని ఆమె తెలిపారు.పారదర్శకంగా ఖర్చు చేస్తున్నామన్న మంత్రి రోజా ప్రతి పైసాకు లెక్క ఉందన్నారు.
చంద్రబాబును సీఎం చేయాలని పురంధేశ్వరి చూస్తోందని అన్నారు.విభజన హామీలు, హోదా కోసం పురంధేశ్వరి ప్రయత్నించాలని సూచించారు.