చంద్రబాబు అబద్దాలనే పురంధేశ్వరి చెబుతోంది..: మంత్రి రోజా

ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరిపై మంత్రి రోజా తీవ్రంగా మండిపడ్డారు.పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలా? లేక టీడీపీ అధ్యక్షురాలా? అని ప్రశ్నించారు.చంద్రబాబు అబద్దాలనే పురంధేశ్వరి చెబుతోందని విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందా లేక ఇది వరకే అప్పుల్లో మునిగిపోయిందా అన్న విషయం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పాలన్నారు.

 Purandheshwari Says That Chandrababu Is Lying..: Minister Roja-TeluguStop.com

చంద్రబాబు హయాంలోనే ఎక్కువ అప్పులు చేశారని చెప్పారు.మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ అప్పులు చాలా తక్కువని పేర్కొన్నారు.ప్రతి పైసా సంక్షేమ పథకాల కోసమే ఖర్చు చేస్తున్నామని ఆమె తెలిపారు.పారదర్శకంగా ఖర్చు చేస్తున్నామన్న మంత్రి రోజా ప్రతి పైసాకు లెక్క ఉందన్నారు.

చంద్రబాబును సీఎం చేయాలని పురంధేశ్వరి చూస్తోందని అన్నారు.విభజన హామీలు, హోదా కోసం పురంధేశ్వరి ప్రయత్నించాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube