ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడలో త్వరలోనే ఎస్సీల బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.సబ్ ప్లాన్ నిధుల కోసం బీజేపీ ఎస్సీ మోర్చా 48 గంటల దీక్ష చేపట్టమన్నారు.
ఇతర పార్టీలు కేవలం మీటింగ్ లు మాత్రమే పెట్టాయని విమర్శించారు.అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం అవుతున్నామని చెప్పారు.
ఎస్సీలను వైసీపీ ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటుందని విమర్శించారు.రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదన్న ఆయన వాలంటీర్ల ద్వారా సర్కార్ కు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు.