అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉంది.డిసెంబర్ మొదటి వారం నుండి యాక్టివ్ గా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించాలని యూనిట్ సభ్యులు నిర్ణయించుకున్నారు.
అందుకు గాను ఏర్పాట్లు పూర్తి చేశారు.మొదటగా ట్రైలర్ ను విడుదల చేసేందుకు గాను తేదీని ప్రకటించారు.
పుష్ప ట్రైలర్ తో సినిమా స్థాయిని అమాంతం పెంచేలా ప్లాన్ చేస్తున్నారు.ఇక సినిమా చిత్రీకరణ మొదలు అయినప్పటి నుండి కూడా ఈ సినిమా ను పాన్ ఇండియా మూవీ అంటున్నారు.
కనుక పాన్ ఇండియా రేంజ్ లోనే ప్రమోషన్ ఉండాలనే ఉద్దేశ్యంతో పాన్ ఇండియా సూపర్ స్టార్ ను రంగంలోకి దించబోతున్నట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ గా నిలిచిన ప్రభాస్ ప్రస్తుతం పుష్ప తో పాన్ ఇండియా మార్కెట్ వైపు అడుగులు వేస్తు అల్లు అర్జున్ కు మద్దతు ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు.
ఇటీవల తనకు ఆప్తుడు అయిన పూరి తనయుడు ఆకాష్ సినిమా ను ప్రభాస్ ఎంతగా ప్రమోట్ చేశాడో అందరం చూశాం.
కనుక పుష్ప సినిమా ప్రమోషన్ లో కూడా ఖచ్చితంగా ప్రభాస్ యాక్టివ్ గా పాల్గొంటాడానే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా చివరి ఐటెం సాంగ్ షూటింగ్ జరుగుతోంది.సెన్సార్ కార్యక్రమాలకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
మొత్తానికి పుష్ప ను ప్రభాస్ ప్రమోట్ చేయబోతున్న నేపథ్యంలో బజ్ రెట్టింపు అవ్వడం ఖాయం అంటున్నారు. అల్లు అర్జున్ కు జోడీగా ఈ సినిమా లో రష్మిక మందన్నా నటిస్తున్న విషయం తెల్సిందే.
సునీల్.ఫాహద్ ఫాజిల్.
అనసూయ ఇంకా పలువురు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.సుకుమార్ ఈ సినిమా ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించాడు.
సినిమా రెండు పార్ట్ లుగా విడుదల కాబోతుంది.మొదటి పార్ట్ డిసెంబర్ లో కాగా రెండవ పార్ట్ వచ్చే ఏడాదిలో ఉండే అవకాశం ఉంది.