వికేంద్రీకరణకు మద్దతుగా వైసీసీ ఈ నెల 15న విశాఖ గర్జన ర్యాలీకి శ్రీకారం చుట్టింది.ఈ కార్యక్రమానికి మద్దతుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ర్యాలీలు చేపట్టాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఈ నెల 15 నుంచి మూడు రోజులపాటు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ విశాఖలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది.దీనిలో భాగంగా అదే రోజు ఉత్తరాంధ్ర జనసేన నేతలు, కార్యకర్తల సమావేశం, 16న ఉత్తరాంధ్ర జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
అయితే 15వ తేదీ పవన్ కళ్యాణ్ తన పర్యటనను రద్దు చేసుకోవాలని మంత్రి అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు.పవన్ అజ్ఞాతవాసి కాదు.
అజ్ఞాన వాసి అని విమర్శించారు.