‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ పడ్డప్పుడు ఏ దర్శకుడు అయినా చకచక సినిమాలు చేస్తూ పోతాడు.వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూ నాలుగు సినిమాలు వెనకేసుకోవడంతో పాటు నాలుగు రూపాయలు కూడా వెనకేసుకునేందుకు ప్రయత్నిస్తాడు.
కాని గీత గోవిందం దర్శకుడు పరుశురామ్ను చూస్తుంటే మాత్రం ఈయన మరీ ఇంత తెలివి తక్కువ వాడా ఏంటీ అనిపిస్తుందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఈయన గీత గోవిందం సక్సెస్ను క్యాష్ చేసుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యాడు.
గీత గోవిందం విడుదలైన వెంటనే ఈయనకు వరుసగా ఆఫర్లు వచ్చాయి.కాని మహేష్బాబుతోనే చేయాలనే ఉద్దేశ్యంతో టైం వృదా చేశాడు.ఆ సమయంలో యంగ్ హీరోలు పలువురు వెంటనే డేట్లు ఇచ్చేందుకు సిద్దం అయ్యారు.కాని పరశురామ్ మాత్రం పట్టించుకోలేదు.
ఆ తర్వాత మహేష్బాబును కాదని యంగ్ హీరోల చుట్టు తిరిగే ప్రయత్నం చేశాడు.అయితే ఎవరు ఖాళీ లేకపోవడంతో పరుశురామ్ వెయిట్ చేయాల్సి వచ్చింది.
ఎట్టకేలకు నాగచైతన్య డేట్లు ఇచ్చేందుకు సిద్దం అయిన సమయంలో మళ్లీ మహేష్బాబు నుండి పిలుపు రావడంతో చైతూను పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది.మహేష్ బాబు నుండి పిలుపు అయితే వచ్చింది కాని ఆఫర్ ఇంకా రాలేదని తెలుస్తోంది.స్క్రిప్ట్ ఓకే అయితేనే మహేష్బాబుతో సినిమా మొదలు అవుతుంది.స్క్రిప్ట్ నచ్చకుంటే మళ్లీ పరశురామ్ పాత గతినే హీరోలను వెదుక్కోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.