‘బాహుబలి’ చిత్రం తర్వాత ప్రభాస్ చేస్తున్న మూవీ ‘సాహో’.యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ మరియు ప్రమోద్లు ఈ చిత్రాన్ని సుజీత్ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.
కేవలం ఒకే ఒక్క చిత్రానికి దర్శకత్వం వహించిన సుజీత్పై నమ్మకంతో యూవీ క్రియేషన్స్ నిర్మాతలు భారీ బడ్జెట్ను పెట్టేందుకు ముందుకు వచ్చారు.ప్రభాస్కు దేశ వ్యాప్తంగా భారీ ఇమేజ్ దక్కింది.
ఆ ఇమేజ్తో ‘సాహో’ను తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళ భాషల్లో కూడా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.అందుకే ఈ చిత్రానికి భారీగా ఖర్చు చేస్తున్నారు.
‘సాహో’ చిత్రం కోసం ఒక యాక్షన్ ఎపిసోడ్ను దాదాపు రెండు నెలలు పాటు చిత్రీకరించారు.దుబాయిలో జరిగిన ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం ఏకంగా 90 కోట్లు ఖర్చు చేసినట్లుగా స్వయంగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన 30 శాతం చిత్రీకరణ పూర్తి అయినట్లుగా తెలుస్తోంది.ఈ 30 శాతం సీన్స్ కోసం ఏకంగా 130 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.
సినిమా ఇంకా చాలా చిత్రీకరణ మిగిలి ఉంది.ఇలాంటి సమయంలో సాహో బడ్జెట్ మరెంతగా పెరిగి పోతుందో అంటూ ఆందోళన వ్యక్తం అవుతుంది.
మొదట ‘సాహో’ చిత్రాన్ని 150 కోట్లతో చిత్రీకరించబోతున్నట్లుగా యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ప్రకటించారు.కాని ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సినిమ 250 కోట్ల బడ్జెట్ను దాటేలా ఉందని అనిపిస్తుంది.ఏమాత్రం తగ్గకుండా, ప్రతి సీన్ను, ప్రతి విషయాన్ని రిచ్గా చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రానికి భారీ బడ్జెట్ను పెడుతున్నారు.ప్రభాస్ బాహుబలి వల్ల భారీ క్రేజ్ను దక్కించుకున్నాడు.
అయితే ఈ సినిమాకు ఆ క్రేజ్ కంటిన్యూ అయితే పర్వాలేదు.కాని ఒకవేళ ఫలితం తారు మారు అయితే కనీసం 50 కోట్లు కూడా వచ్చే అవకాశం లేదు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.
ఈ చిత్రంలో ప్రభాస్కు జోడీగా ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్ హీరోయిన్గా నటిస్తుంది.ఈ చిత్రంలో ఇంకా పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు కనిపించబోతున్నారు.
సౌత్లోనే అతి పెద్ద చిత్రాల్లో ఇది కూడా నిలువబోతుందని సమాచారం అందుతుంది.బడ్జెట్ పరంగా రికార్డులు సృష్టిస్తున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా ఎలా ఉంటుందో అంటూ ప్రభాస్ అభిమానుల్లో కలవరం మొదలైంది.