మనకు చాలామంది బంధువుల ఉంటారు.కాని కొంతమంది ఇళ్లకే తరచుగా వెళుతుంటాం.
కొందరికి ఇళ్లకు అసలు జీవితంలో ఎప్పుడూ వెళ్లం.ఎప్పుడో ఒక సందర్భంలో వెళితే వెళతాం.
ప్రధానులు, రాష్ర్టపతులు కూడా అంతే.కొన్ని ముఖ్యమైన దేశాలకు అసలు వెళ్లనే వెళ్లరు.
ఆ దేశాలతో మనకు దౌత్యసండంధాలుంటాయి.వ్యాపార సంబంధాలుంటాయి.
అనేక రకాల ఒప్పందాలుంటాయి.కాని ఎందుకో ప్రధానులకు వెళ్లడం కుదరదు.
ఇజ్రాయిల్ ఓ ముఖ్యమైన దేశం.వ్యవసాయ పరంగా ఎంతో అభివృద్ధి చెందింది.
ఎడారిలో పంటలు పండిస్తారు.వారి వ్యవసాయం చూసి మనం ఆశ్చర్యపోతాం.
అలాంటి వ్యవసాయం మనమూ చేయాలని చాలా ప్రయత్నిస్తున్నాం.ఎంతో అభివృద్ధి సాదించిన ఇంత గొప్ప దేశాన్ని ఇప్పటివరకు ఏ భారత ప్రధానీ సందర్శిచలేదు.
మంత్రులు వెళ్లారనుకోండి.అది వేరే విషయం.
ప్రధాని పర్యటనకే ప్రాధాన్యం ఉంటుంది.ఇజ్రాయిల్కు వెళుతున్న మొట్టమొదటి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డులకెక్కారు.
ఆయన త్వరలో ఆ దేశానికి వెళుతున్నారు.అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో పద్దెనిమది విదేశీ పర్యటనలు చేసిన మోదీ రెండో ఏడాదిలోనూ అదే ఊపు కొనసాగిస్తారేమో.