దర్యాప్తు ప్రతినిధి ఎల్లారెడ్డిపేట ఆగస్టు 15: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సిరిసిల్ల భూమయ్య గతవారం క్రితం మరణించడం జరిగింది.ఆ నిరుపేద కుటుంబ దీనగాధ తెలుసుకున్న చేయూత మిత్ర ఫౌండేషన్ సభ్యులు శుక్రవారం వారి కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీల బియ్యం, 5500 రూపాయల నగదు ను అందజేయడం జరిగింది.
బాధిత కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించారు.సిరిసిల్ల భూమయ్య భార్య సిరిసిల్ల రామవ్వకు ఇంకా దాతలు ఎవరైనా ఉంటే సహాయం అందించాలని సభ్యులు కోరారు.ఈ కార్యక్రమంలో చేయూత మిత్ర ఫౌండేషన్ అధ్యక్షుడు దూస శ్రీనివాస్, బాధ గోపి, వడ్నాల ఆంజనేయులు, యమగోండ పద్మారెడ్డి, కదిరే రవి,సిద్ధి రాములు, ఎండి బాబా, దీటి సతీష్ పాల్గొన్నారు.