భారతదేశంలో గతంతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య తగ్గినా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రజలు కరోనా బారిన పడుతున్నారు.మెగా ఫ్యామిలీ హీరోలైన రామ్ చరణ్, వరుణ్ తేజ్ లకు కరోనా నిర్ధారణ కావడంతో మాల్దీవులకు హనీమూన్ కు వెళ్లి తిరిగి ఇండియాకు వచ్చిన నిహారిక చైతన్యలకు కూడా కరోనా సోకే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరిగింది.
అయితే మెగాబ్రదర్, నిహారిక తండ్రి నాగబాబు స్పందిస్తూ నిహారిక చైతన్య కరోనా పరీక్షలు చేయించుకున్నారని వెల్లడించారు.
నిహారిక చైతన్య్ మాల్దీవులకు వెళ్లక ముందే ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం కరోనా పరీక్షలు చేయించుకున్నారని నాగబాబు తెలిపారు.
ఆ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని అన్నారు.డిసెంబర్ 29వ తేదీన తిరిగి వచ్చిన సమయంలో కూడా ముంబాయిలో మళ్లీ కరోనా పరీక్షలు చేయించుకున్నారని.
ఆ పరీక్షల్లో కూడా నెగిటివ్ వచ్చిందని.అభిమానులు కంగారు పడవద్దని వెల్లడించారు.
నాగబాబు స్పందనతో నిహారిక చైతన్యల గురించి పుకార్లకు చెక్ పెట్టారని చెప్పవచ్చు.
నిహారిక, చైతన్యల పెళ్లి ఈ ఏడాది డిసెంబర్ 9వ తేదీన ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.అయితే నిహారిక చైతన్య మరో గ్రాండ్ పార్టీ కూడా ఇవ్వాలని అనుకున్నారని.కానీ మెగా ఫ్యామిలీలో ఇద్దరికి కరోనా సోకడంతో ఆ పార్టీ రద్దైందని సమాచారం.
గత నెల 25వ తేదీన మెగా ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలను జరుపుకుంది.ఆ వేడుకల సమయంలోనే చరణ్, వరుణ్ లకు కరోనా సోకి ఉండవచ్చని తెలుస్తోంది.
క్రిస్మస్ వేడుకలకు నిహారిక చైతన్య జంట హాజరు కావడంతో మెగా ఫ్యాన్స్ కంగారు పడినా నాగబాబు క్లారిటీ ఇవ్వడంతో టెన్షన్ తీరినట్టేనని చెప్పవచ్చు.మరోవైపు కరోనా టెస్టుల్లో నెగటివ్ వచ్చినా కొందరు మెగా హీరోలు టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది.