ఏలూరుజిల్లా నిడమర్రు మండలం మందలపర్రు శ్రీఉమానీలకంఠేశ్వర స్వామి పంచాయతన క్షేత్రంలో నిర్వహిస్తున్న దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీఉమాదేవి అమ్మవారిని 4 కోట్ల రూపాయలు విలువ చేసే కొత్త కరెన్సీనోట్లతో ధనలక్ష్మి అలంకరణ చేశారు.ఆలయ నిర్వాహకులు సరిపల్లి శంకరం, కృష్ణంరాజు, రామచంద్రరాజులు శ్రీఉమాదేవి అమ్మవారికి క్రొత్త కరెన్సీ నోట్లు 2000, 500, 200, 100, 50, 20, 10, 5, 2 మరియు రూపాయి నోట్లతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీ నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక నాణేలను అలంకరణలో వినియోగించారు.
ధనలక్ష్మి అలంకారాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.