గత కొన్నేళ్లలో ప్రేక్షకుల అభిరుచి మారింది.కొత్తదనం ఉన్న కథలను ప్రేక్షకులు బాక్సాఫీస్ వద్ద హిట్ చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కృతి సనన్ తాజాగా తల్లిదండ్రులను దత్తత తీసుకునే కథాంశంతో ఉన్న కథను ఎంచుకున్నారు.తల్లిదండ్రులను దత్తత తీసుకునే కథాంశంలో కృతిసనన్ నటించబోతున్నారు.
దోచెయ్, 1 నేనొక్కడినే సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కృతి ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నారు.
హమ్ దో హమారే దో పేరుతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో హీరో పాత్రలో నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన రాజ్ కుమార్ రావ్ నటిస్తుండటం గమనార్హం.సినిమాలో సందేశంతో పాటు కామెడీ అంశాలకు చోటు ఉంటుందని సమాచారం.
రత్నా పాఠక్ షా, పరేష్ రావెల్ ఈ సినిమా వృద్ధ దంపతుల పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.తాజాగా కృతిసనన్ నటించి విడుదలైన మిమి ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్న సంగతి తెలిసిందే.
మిమి మూవీతో కృతిసనన్ మదర్ రోల్ కోసం కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారు.
మిమి సినిమాలో సరోగేట్ మదర్ పాత్రకు కృతిసనన్ పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.ప్రస్తుతం నటిస్తున్న సినిమాతో ఊహించని స్థాయిలో గుర్తింపును సంపాదించుకుంటామని కృతిసనన్ భావిస్తున్నారు.కృతిసనన్ అంచనాలు ఏ మేరకు నిజం అవుతాయో చూడాల్సి ఉంది.
మరోవైపు ఆదిపురుష్ సినిమా సక్సెస్ సాధిస్తే కృతి కెరీర్ కు ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.వచ్చే ఏడాది ఆగష్టు 11వ తేదీన ఆదిపురుష్ రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.
అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలనే కృతిసనన్ ఎక్కువగా ఎంచుకుంటూ ఉండటం గమనార్హం.కృతిసనన్ నటిస్తున్న హమ్ దో హమారే దో సక్సెస్ సాధిస్తే ఆమెకు మరికొన్ని ఆఫర్లు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.కృతి సనన్ ఎంచుకుంటున్న కథలు ఒక వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.