మళయాళ భామ కీర్తి సురేష్ మధ్యలో కొద్దిగా కెరియర్ లో వెనకపడినట్టు అనిపించినా మళ్లీ అమ్మడు వరుస అవకాశాలను అందుకుంటుంది.మహానటి తర్వాత కోలీవుడ్ లో స్టార్స్ సరసన నటించిన కీర్తి సురేష్ మరోపక్క ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే ఆ సినిమాలేవి ఆమెకు మంచి ఫలితాలు అందించలేదు.హిట్లు లేకపోయినా సరే కీర్తి సురేష్ కు ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు.
కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో సర్కారు వారి పాట సినిమా చేస్తుంది.ఈ సినిమాతో పాటుగా భోళా శంకర్ లో కూడా నటిస్తుంది.
ఈ రెండిటితో పాటుగా నాని దసరా సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.ఈ 3 సినిమాలతో మళ్లీ తెలుగులో కీర్తి సురేష్ తన సత్తా చాటాలని ఫిక్స్ అయ్యింది.
అంతేకాదు మరో రెండు సినిమాలు కూడా లైన్ లో ఉన్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.మొత్తానికి సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా సరే మళయాళ భామకి అవకాశాలు మాత్రం అదిరిపోతున్నాయని చెప్పొచ్చు.
తప్పకుండా కీర్తి సురేష్ తిరిగి తెలుగులో సూపర్ ఫాం కొనసాగించేలా ఉంది.ప్రస్తుతం కమర్షియల్ సినిమాల్లో నటిస్తున్న అమ్మడు మళ్లీ లేడీ ఓరియెంటెడ్ కథలపై ఆసక్తి చూపిస్తుందని తెలుస్తుంది.