చేతన్ కుమార్ అహింస గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మారు మోగుతున్న పేరు.హిందూమతాన్ని, హిందువుల మత విశ్వాసాలను అవమానించేలా కామెంట్లు చేశాడు.
అలాగే కులాల మధ్య శత్రుత్వం పెరిగేలా వ్యాఖ్యలు చేశాడు.హిందుత్వ అనేది అబద్ధం మీద నిర్మించబడిందని ఆరోపిస్తూ సంచలన ట్వీట్ చేసాడు.
కాగా ఈ విషయంపై బెంగళూరు( Bangalore ) పోలీసులు చేతన్ కుమార్( Chetan Kumar ) అహింసను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.బెంగళూరులోని శేషాద్రిపురం పోలీసులు కస్టడీలోకి తీసుకుని అనంతరం అతన్ని జిల్లా కోర్టుకు తరలించారు.
తరువాత బెయిల్పై విడుదలైన చేతన్ మళ్లీ తన పంథాను అదే విధంగా కొనసాగించాడు.
దీంతో అతడికి దిమ్మతిరిగే షాక్ నిచ్చింది కేంద్రం.సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ.దళిత, గిరిజనుల హక్కుల కార్యకర్తగా చెప్పుకుంటున్న చేతన్ అహింసా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు.
తాజాగా ఓ కేసులో అరెస్టు అయ్యి బెయిల్ పై విడుదలైన ఆయన తన పంథాను మార్చుకోలేదు.మొన్నటికి మొన్న తిరుపతి వెంకన్నపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
చేతన్ కుమార్ అహింస హిందూత్వ వ్యతిరేక వ్యాఖ్యపై బెంగళూరు పోలీసులు అరెస్టు చేసిన కొన్ని రోజుల తర్వాత అతడి ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా కార్డును ప్రభుత్వం రద్దు చేసింది.ఈ విషయాన్ని అహింసా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.
తాజాగా చేతన్ కుమార్ అహింసా ట్వీట్ చేస్తూ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా భారతదేశంలో ఉండటానికి నా వీసాను రద్దు చేసింది అని పేర్కొన్నారు.వీసా రద్దు చేసిన కేంద్ర హోం శాఖ కార్యాలయం అధికారులు ఎఫ్ఆర్ఆర్ ద్వారా చేతన్కు లేఖ పంపించి 15 రోజుల లోపు ఓసీఐ కార్డు వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారట.కన్నడ హీరో చేతన్ ఓసీఐ రద్దు చేస్తూ మార్చి 28వ తేదీన కేంద్ర హోం శాఖ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.తరువాత ఆదేశాల పత్రాలను ఎఫ్ఆర్ఆర్ ద్వారా పంపించడంతో ఏప్రిల్ 14వ తేదీన హీరో చేతన్ కు ఆ పత్రాలు అందాయని సంబంధిత అధికారులు అంటున్నారు.
సీఐ వెనక్కు ఇచ్చినట్లు అయితే దేశ బహిష్కరణకు గురైనట్లే అని చేపవచ్చు.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఏడుకొండల వారితో పెట్టుకుంటే ఇట్లే ఉంటుంది అని కొందరు కామెంట్స్ చేయగా, ఇంకొందరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.