కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్( Dhanush ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ధనుష్ కి కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
కన్నడలో ధనుష్ నటించిన సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచాయి.ఇది ఇలా ఉంటే ధనుష్ ఇటీవలే తెలుగులో నేరుగా సార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ అని అందుకుంది.కాగా ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
ఇటీవల కాలంలో వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు ధనుష్.ప్రస్తుతం మరికొన్ని సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు ధనుష్.ఇది ఇలా ఉంటే తాజాగా హీరో ధనుష్ తిరుమల శ్రీవారిని( tirumala ) దర్శించుకున్నారు.సోమవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన ధనుష్ స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
ఆలయ వెలుపలికి వచ్చిన ధనుష్ను చూసేందుకు, ధనుష్తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు.అయితే ధనుష్ బాడీ గార్డులు అత్యుత్సాహం చూపడంతో వీడియో చిత్రీకరిస్తున్న మీడియా కెమెరామెన్ కింద పడ్డాడు.దీంతో మీడియా కెమెరామెన్లు ధనుష్ బాడీగార్డులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ధనుష్ బాడీగార్డ్స్ చేసిన పనికి నెటిజన్స్ మండిపడుతున్నారు.ఇలాంటి బాడీగార్డ్స్ వల్ల అనవసరంగా హీరోలకు చెడ్డ పేరు వస్తుంటుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.