పెనుగంచిప్రోలు: విద్యుత్తు కోతల ప్రభావం వివాహ వేడుకల్లోనూ కనిపిస్తోంది.పెనుగంచి ప్రోలుకు చెందిన నల్లపనేని నరేష్, త్రిశంకల వివాహం శనివారం స్థానిక కల్యాణ మండపంలో నిర్వహించారు.
కుటుంబ సభ్యులు, బంధువులు వధూ వరులను ఆశీర్వదించి బహుమతులు ఇస్తున్నారు.తెదేపా నాయకుడు, మాజీ సర్పంచి జిల్లేపల్లి సుధీర్ బాబు పెళ్లి కూతురు, కుమారుడికి ఆకర్షణీయమైన కవర్లు కానుకగా ఇచ్చారు.
వారు ఆ కవర్లను విప్పి చూడగా ఒకదానిలో కొవ్వొత్తులు, మరోదానిలో రెండు విసనకర్రలు ఉన్నాయి.వధూ వరులతో పాటు, వివాహానికి వచ్చిన ఆహుతుల ముఖాల్లో నవ్వులు విర బూశాయి.
విద్యుత్తు కోతల నేపథ్యంలో వాటిని నవ దంపతులకు అందించినట్లు సుధీర్బాబు తెలిపారు.