తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజన్.ప్రస్తుతం ఐదో వారంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.
అయితే సోమవారం వచ్చిందంటే చాలు.బిగ్ బాస్ ఇల్లు హీటెక్కిపోతుంది.
ఎందుకంటే.నామినేషన్స్ జరిగేది ఆ రోజే కాబట్టి.
వారం మొత్తం సంతోషంగా ఉన్న ఇంటి సభ్యులు.ఆ రోజు శత్రువులుగా మారిపోతుంటారు.
ఇప్పటికే బిగ్ బాస్ ఇంటి నుంచి సూర్య కిరణ్, కరాటే కళ్యాణి, యాంకర్ దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్ బ్యాగ్ సద్దేశారు.ఇక ఐదో వారం ఎలిమినేషన్కు.
నామినేషన్ ప్రక్రియ సోమవారం జరిగింది.ఈ వారం నామినేషన్స్లో ఓ చిన్నపాటి యుద్ధమే జరిగింది అనడంలో సందేహం లేదు.
అయితే ఈ నామినేషన్స్లో అఖిల్నే ఎక్కువ మంది టార్గెట్ చేశారు.అరియానా, అవినాష్, సుజాత, రాజశేఖర్ మాస్టర్, హారిక, అభిజిత్లు.
అఖిల్ను నామినేట్ చేశారు.వీరిందరూ చెప్పింది కూడా ఒకే రీజన్.
అదేంటంటే లగ్జరీ బడ్జెట్ టాస్క్లో అఖిల్ తీరు తమకు నచ్చలేదని చెప్పారు.లగ్జరీ బడ్జెట్ విషయంలో అఖిల్ స్వార్థంగా ఆలోచించి.
తను అనుకున్న వాళ్ల కోసమే షాపింగ్ చేసి మిగిలిన వాళ్లకి చేయకపోవడం నచ్చలేదని అందరూ తేల్చి చెప్పాలి.అయితే వాస్తవానికి అఖిల్ రేషన్ మేనేజర్ అయ్యాడని చెప్పిన బిగ్ బాస్.
మొత్తం 16 మంది సభ్యులకు 16 లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్ నువ్వే రాయాల్సి ఉంటుందని చెప్పారు.కానీ, ఉన్న లగ్జరీ బడ్జెట్ పాయింట్స్ని 16 మంది ఇంటి సభ్యులకు షేర్ చేయడం అఖిల్కి కష్టంగా మారడంతో.
అందరికీ లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్ రాయలేకపోయారు.
కేవలం కొంత మందికే లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్ రాయగలిగాడు.
దీంతో ఇంటి సభ్యులందరూ అప్పుడే అసహనం వ్యక్తం చేశాడు.ఇప్పుడు దాన్నే కారణంగా చూపి నామినేట్ చేశారు.
మొత్తానికి బిగ్ బాస్ ఇచ్చిన ఆ పెద్ద టాస్క్ అఖిల్ కొంప ముంచినట్లు అయింది.కాగా, ఈ వారం నామినేషన్స్లో అఖిల్, నోయల్, మోనాల్, లాస్య, సుజాత, అరియానా, సొహైల్, అమ్మా రాజశేఖర్ మాస్టర్, అభిజిత్లు ఉన్నాయి.
మరి వీరిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారో చూడాలి.