తెలంగాణలో సంచలనంగా నిలిచిన ఫామ్ హౌజ్ ప్రలోభాల కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.హైకోర్టు రిమాండ్ ను సవాల్ చేస్తూ ముగ్గురు నిందితులు సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించారు.
బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టు సాయంత్రం ఉత్తర్వులు ఇవ్వనున్నందున విచారణను వాయిదా వేయాలని నిందితుల తరపు న్యాయవాది ధర్మసనాన్ని కోరారు.ఈ క్రమంలో స్పందించిన న్యాయస్థానం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.