నందమూరి తారకరత్న నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ కుమద్దతు తెలుపుతూ ఆయన కూడా పాదయాత్రలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.అయితే పాదయాత్రలో ఉన్నఫలంగా నందమూరి తారకరత్న స్పృహ తప్పి పడిపోవడం అందరిని ఆందోళనకు గురి చేసింది.
అయితే ఈయన ప్రస్తుతం చికిత్స తీసుకుంటూ హాస్పిటల్లో ఉండగా నందమూరి తారకరత్నకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ క్రమంలోనే నందమూరి తారకరత్న వైఎస్ఆర్సిపి పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డికి చాలా దగ్గర సంబంధం ఉందని తెలుస్తోంది.
వైసీపీ పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఎంపీ విజయసాయి రెడ్డికి తారకరత్న స్వయంగా అల్లుడు వరస అవుతారు.ఇలా తారకరత్న విజయసాయిరెడ్డి మధ్య రిలేషన్ ఉందని తెలుస్తోంది.విజయ్ సాయి రెడ్డి భార్య సునంద సొంత చెల్లెలి కుమార్తె అలేఖ్యను నందమూరి తారక రత్న వివాహం చేసుకున్నారు.దీంతో విజయ సాయి రెడ్డికి తారకరత్న అల్లుడు అవుతారు.
అలేఖ్య ఫిలిం ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు.
ఇలా ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కాస్టింగ్ డిజైనర్ గా పనిచేస్తూ ఉండగా తారకరత్న నటించిన నందీశ్వరుడు సినిమాకి గాను ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు.అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడటం ఆ పరిచయం ప్రేమగా మారడం జరిగింది.ఇలా ప్రేమలో ఉన్నటువంటి అలేఖ్య తారకరత్న ఇద్దరు కూడా హైదరాబాదులోని సంఘీ టెంపుల్ లో వివాహం చేసుకున్నారు.
ఇలా ప్రస్తుతం తారకరత్న అలేఖ్యను ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల విజయసాయిరెడ్డి తారకరత్న మధ్య మామ అల్లుళ్ళ అనుభందం ఏర్పడిందని తెలుస్తుంది.