ఆచార్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి మళాయళ మూవీ లూసిఫర్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను కోలీవుడ్ డైరక్టర్ మోహన్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు.
ఈ సినిమా తర్వాత కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.కె.ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ చిరుతో ఓ మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నట్టు టాక్.ఈ సినిమా కథ బాబీ విజయ్ దేవరకొండ కోసం రాసుకున్నాడట.విజయ్ కు కథ చెబితే తనకు నచ్చినా ఇప్పుడు వరుస సినిమాలు ఉన్నాయని వన్ ఇయర్ ఆగాలని చెప్పాడట.
వెంకీమామ చూసిన చిరు బాబీకి డైరక్షన్ ఛాన్స్ ఇచ్చారు.అయితే విజయ్ దేవరకొండ కోసం రాసుకున్న కథనే చిరుకి వినిపించారట కథ నచ్చిన మెగాస్టార్ వెంటనే సినిమాను ఓకే చేశారు.
మరి విజయ్ దేవరకొండ కోసం రాసుకున్న కథ చిరుకి ఎలా సూట్ అవుతుంది.ఇంతకీ బాబీ ఎలాంటి కథతో చిరుని ఇంప్రెస్ చేశాడు అన్నది తెలియాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారని తెలుస్తుంది.సినిమా కు టైటిల్ గా వీరయ్య అని పరిశీలనలో ఉంది.ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు చిరంజీవి.