ఆషాడ మాసం ప్రారంభం కావడంతో తెలంగాణలో బోనాల పండుగ సందడి మొదలు అయ్యింది.ఇవాల్టి నుంచి ఆషాడమాసం బోనాల పండుగ షురూ కావటంతో తెలంగాణ ప్రజలు అదే రీతిలో మంత్రులు పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించడానికి రెడీ అయ్యారు.
ఈరోజు నుండి జూలై 26 వ తారీఖు వరకు బోనాల సంబరాలు.తెలంగాణలో జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులకు మరియు ప్రజలకు సోషల్ మీడియా ద్వారా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.
“బోనాలపండుగ ప్రారంభం సందర్భంగా ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు.తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు.వర్షాలు బాగా కురవాలని, పాడిపంటలు వృద్ధి చెందాలని, అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఆషాఢ మాసం అంతా జరిగే ఈ ఉత్సవాలను అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో రోజుకో ప్రాంతంలో జరిగే ఈ పండుగను ప్రజలు.అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.
లంగర్ హౌస్ దగ్గర తొలి బోనానికి సర్వం సిద్ధం అయ్యింది.
.