దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధానాన్ని మళ్లీ అమలులోకి తీసుక వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.ఈ తరుణంలో మందుబాబులు మందు తాగకపోతే ఈ రోజు మందు బాబులు చలో లిక్కర్ షాప్ అని పరుగులు పెడుతున్నారు.
జూన్ 19 నుంచి లాక్ డౌన్ విధించిన కొన్ని ప్రాంతాలలో వైన్ షాపులు ఎదుట జనాలు అధిక సంఖ్యలో ఉంటున్నారు.అంతే కాకుండా తమకు మద్యం బాటిళ్లు దొరుకుతాయా లేదా అన్న టెన్షన్ లో క్యూలైన్లలో ఎగబడి కొనుగోలు చేస్తున్నారు.
వీటితో పాటు ఒక్కొక్కరు భారీగా మందు బాటిల్స్ కొనుగోలు చేస్తున్నారని సమాచారం.ఇక తమిళనాడు రాష్ట్రంలో నాలుగు జిల్లాలలో లాక్ డౌన్ మళ్లీ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.
తమిళనాడు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకి అధిక సంఖ్యలో నమోదు అవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతుంది.తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యంగా చెన్నై, చంగల్ పట్టు, కాంచీపురం, తిరువల్లూరు జిల్లాలో అత్యధికంగా రోజురోజుకి పాజిటివ్ కేసులు నిర్ధారణ ఎక్కువ అవుతున్నాయి.
ఇక దీంతో ఈ జిల్లాలో పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలు చేయాలని సీఎం పళనిస్వామి నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఈ లాక్ డౌన్ జూన్ 19 నుంచి అమల్లోకి రాబోతుంది.
పదకొండు రోజులపాటు విధించే ఈ లాక్ డౌన్ ఈ సమయంలో మద్యం దొరకదు అనే విషయం అందరికి తెలిసినదే.ఇందుకోసం ముందుగానే మద్యం షాపుల ముందు భారీ స్థాయిలో క్యూలైన్లలలో కొనుగోలు చేయడం మొదలుపెట్టారు.
ఉదయం నుంచే మందు షాపులు ముందు బారులు తీరి కొనుగోళ్లు చేస్తున్నారు.