మెగా ఫ్యామిలీ హీరోలు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హల్చల్ చేస్తున్నారు.మెగా ఫ్యామిలీలో బడా హీరోలే కాకుండా తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఇద్దరు మెగా హీరోలలో సాయిధరమ్ తేజ్ ఒకరైతే, మరొకరు వరుణ్ తేజ్.
వీరిద్దరిలో సాయి ధరమ్ తేజ్ ని పైకి తీసుకురావటానికి, స్టార్ డం ని సంపాదించుకున్న మెగా హీరోలు తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు.ఇందుకు అల్లుఅర్జున్ మొదటి వరుసలో ఉన్నాడు.
సాయి ధరమ్ తేజ్ అప్ కమింగ్ మూవీలో అల్లుఅర్జున్ ఓ ఏడు నిముషాలు కనిపించబోతున్నాడు.అయితే ఈ మూవీకి సంబంధించిన స్టోరి డిస్కషన్స్ ఇంకా జరుగుతున్నాయి.
స్టోరి ఫైనల్ అయిన తరవాత దీనికి సంబంధించిన న్యూస్ ని అఫిషియల్ గా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.సాయి ధరమ్ తేజ్ అంటే అల్లుఅర్జున్ కి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్.
అందుకే సాయి ధరమ్ తేజ్ కి మంచి బ్రేక్ ఇవ్వాలంటే, మూవీలో ఏదొక హైప్ క్రియేట్ అవ్వాలని బన్నీ కోరుకుంటున్నాడట.మరి అల్లు అర్జున్ స్పెషల్ రోల్ సాయి కి ఎంతవరకు కలసి వస్తుందో చూడాలి.