మన టాలీవుడ్ హీరోలను ఫ్యాన్స్ ఎంత గౌరవంగా, అభిమానంగా చూస్తారో.మన హీరోలు కూడా ఫ్యాన్స్ పట్ల అంతే అభిమానంతో వ్యవహరిస్తారు.
వారికీ ఏదైనా కష్టం వచ్చింది అని తెలిస్తే వారి కోసం ఎంత దూరం అయినా వెళ్లి పలకరించి వస్తారు.అలాంటి మన హీరోల గురించి ఎంత చెప్పిన తక్కువే.
అందుకే మన తెలుగు హీరోలకు అభిమానులు భారీ సంఖ్యలో ఉంటారు.ఇక తాజాగా అల్లు అర్జున్ మరోసారి తన ఫ్యాన్స్ పట్ల ఎంత అభిమానం ఉంటుందో నిరూపించారు.
తాజాగా పుష్ప టీమ్ అంతా రష్యాలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్.
ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది.పుష్ప సినిమాతో ఇటు సౌత్ తో పాటు నార్త్ లో, వరల్డ్ వైడ్ గా కూడా భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు.
ఇదిలా ఉండగా ఈ సినిమా టీమ్ ఇప్పుడు రష్యాలో ప్రత్యక్షం అయ్యింది.ఎందుకంటే డిసెంబర్ 8న రష్యాలో పుష్ప సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.దీంతో పుష్ప టీమ్ అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక మందన్న అంతా రష్యాకు బయల్దేరి వెళ్ళింది.అక్కడే ప్రెజెంట్ యూనిట్ మొత్తం ప్రొమోషన్స్ చేస్తూ బిజీగా ఉంది.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ చేసిన పని ఇప్పుడు అందరి చేత ప్రశంసలు అందుకునేలా చేస్తుంది.
అల్లు అర్జున్ రష్యాలో దివ్యానంగుడైన అభిమానిని చూసి చలించిపోయి అతడితో అభిమానంగా కాసేపు ముచ్చటించారు.అభిమానుల కోసం ఎంత తగ్గినా తప్పులేదు అని నిరూపించాడు.దీనికి సంబందించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
ఇక ఈ సినిమా పార్ట్ 1సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మైత్రి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సుకుమార్ కూడా పక్క ప్లానింగ్ తో మరింత పక్కాగా స్క్రిప్ట్ తో బరిలోకి దిగుతున్నాడు.
త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.మైత్రి మూవీ మేకర్స్ మరింత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.