బేర్ గ్రిల్స్.ఈ పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.డిస్కవరీ చానల్ చూసేవారికి ఇతను భాగా సుపరిచితం.అడవిలోకి వెళ్లి భయంకరమైన సాహసాలు చేస్తూ ఉంటారు.మ్యాన్ వర్సెస్ వైల్డ్ పేరుతో అతడు చేసే సాహసాలు చిన్నా పెద్దా అందరినీ ఆకర్షిస్తుంటాయి.బేర్తో కలిసి సాహసాలు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు ఆసక్తి చూపుతుంటారు.
ఈ మధ్య కాలంలో భారత ప్రధాని నరేంద్రమోదీ, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బేర్ గ్రిల్స్ తో కలిసి సాహసాలు చేశారు.అవి డిస్కవరీ చానల్ లో కూడా ప్రసారమై ఎక్కువ టీఆర్పీ రేటింగ్స్ తెచ్చుకున్నాయి.
రజినీకాంత్, మోడీతో డాక్యుమెంటరీలు చేయడం వలన అతను ఇండియాలో కూడా చాలా మందికి పరిచయం అయిపోయాడు.ఇప్పుడు బేర్ గ్రిల్స్ తో కలిసి అక్షయ్ కుమార్ సాహసాలు చేశాడు.
ఇప్పటికే దీనికి సంబందించిన షూటింగ్ పూర్తయిపోయింది.వచ్చే నెల 11న డిస్కవరీ ప్లస్ యాప్లో, 14న డిస్కవరీ చానల్లో అక్షయ్ కుమార్ పాల్గొన్న మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రాం టెలికాస్ట్ అవుతుంది.
ఈ ఎపిసోడ్కు సంబంధించిన టీజర్ను అక్షయ్ కుమార్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.మీరు నన్ను పిచ్చోడనుకుంటున్నారా.పిచ్చోళ్లే అడవిలోకి వెళ్తారు అని దానికి కామెంట్ ఇచ్చాడు.ఆసక్తికరంగా ఉన్న ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఇప్పటి వరకు దీనిని 60 లక్షల మందికిపైగా వీక్షించారు.ఇప్పటికే బేర్ గ్రిల్స్ ప్రధాని మోడీ, రజినీకాంత్ లతో చేసిన ఈ ప్రోగ్రాంతో ఇండియాలో భాగా పాపులారిటీ సొంతం చేసుకోవడంతో ఎక్కువ మంది ఆ ప్రోగ్రాం వీక్షించే విధంగా చేసుకున్నారు.
మరి అక్షయ్ కుమార్ మామూలుగానే సాహసాలు చేస్తారు.ఇక బేర్ గ్రిల్స్ తో కలిస్తే అతనిని ఆపడం కష్టం.
మరి వీరి విన్యాసాలు ఎలా ఉంటాయో అనేది ఇప్పుడు అందరికి ఆసక్తికరంగా మారింది.