డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ప్రపంచమంతటా….క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.
తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నో సంబరాలలో పాల్గొన్నారు ప్రజలు.అంతేకాకుండా నటీనటులు కూడా క్రిస్మస్ సంబరాలు జరుపుకొని తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
కాగా అక్కినేని కుటుంబం కూడా ఫోటో ను షేర్ చేసి తమ సంతోషాలను అభిమానులకు చూపారు.
మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా కొత్తగా పెళ్లి చేసుకున్న నిహారిక కొణిదెల కూడా పండుగ వేడుకల్లో పాల్గొన్న ది.కాగా అక్కినేని కుటుంబం క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకొని….తమ కుటుంబ సభ్యులతో సందడి చేశారు.ఈ విధంగా తమ క్రిస్మస్ ఫోటో ను నాగార్జున భార్య అమల ట్విట్టర్ లో తన ఖాతాలో షేర్ చేసింది.
వెంటనే ఆ ఫోటో చూసినా నెటిజనులు, అక్కినేని అభిమానులు మురిసిపోతున్నారు.నాగార్జున, అమల తో పాటు నాగచైతన్య, సమంత, అఖిల్, సుమంత్, సుశాంత్… మరికొంతమంది కుటుంబ సభ్యులతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ ఫోటోని షేర్ చేసిన అమలాకు అక్కినేని అభిమానులు థాంక్యూ మేడమ్ అంటూ….కృతజ్ఞతలు తెలిపారు.
కాగా అక్కినేని కుటుంబం నాగేశ్వరరావు నుండి అఖిల్ వరకు అభిమానుల మనసులను గెలుచుకొని ఆ కుటుంబం మంచి ఆదర్శవంత కుటుంబంగా నిలిచింది.ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరూ తమ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
నాగార్జున ఇటీవలే పూర్తయిన బిగ్ బాస్ 4 లో హోస్టింగ్ చేయగా….తన కోడలు సమంత ఆహ లో సామ్…జామ్ అంటూ ఓ షో లో హోస్టింగ్ చేస్తుంది.
కాగా ఇందులో నటీనటుల వ్యక్తిగత విషయాల గురించి అడుగుతూ షో ను ప్రారంభించింది.నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమా తో… అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల తో బిజీగా ఉన్నారు.